Kaizer News

నేను వికెట్‌ టేకర్‌ని భయ్యా.. జీరో రిస్క్, 100 శాత

నేను వికెట్‌ టేకర్‌ని భయ్యా.. జీరో రిస్క్, 100 శాతం రిజల్ట్ అని చెప్పినా వినలే..: వైభవ్ సంచలన వ్యాఖ్యలు

· Sports · tv9telugu.com

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. సాధారణంగా అతడి పేరు వినగానే భారీ సిక్సర్లు, దూకుడైన బ్యాటింగ్‌ గుర్తుకొస్తుంది. కానీ తాజాగా దులీప్‌ ట్రోఫీలో బంతితోనూ తన సత్తా చాటాడు. ఈస్ట్‌ జోన్‌ తరపున ఆడుతున్న వైభవ్‌.. నార్త్‌ఈస్ట్‌ జోన్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన అనంతరం బీసీసీఐ డొమెస్టిక్‌ విడుదల చేసిన వీడియోలో వైభవ్‌ తన బౌలింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ తనకు బంతి ఇవ్వడాన్ని ‘రిస్క్‌’గా భావించాడని చెప్పాడు. అయితే.. తనలోని అసలు బౌలర్‌ గురించి ఇషాన్‌కు తెలియదని నవ్వుతూ పేర్కొన్నాడు. నార్త్‌ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే బ్యాట్‌తో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈస్ట్‌ జోన్‌ భారీ ఆధిక్యం సాధించిన తర్వాత నార్త్‌ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ వికెట్లు త్వరగా పడకపోవడంతో కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. యువ వైభవ్‌ చేతికి బంతిని అందించాడు. ఆ అవకాశాన్ని 15 ఏళ్ల ఈ క్రికెటర్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బంతి అందుకున్న కొద్దిసేపటికే వైభవ్‌ తన ప్రభావం చూపించాడు. మొదట కిషన్‌ లింగ్డోహ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కేవలం మూడు బంతులకే ఇమ్లివతి లెమ్తుర్‌ను ఔట్‌ చేశాడు. దీంతో నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు అతడి ఖాతాలో చేరాయి. మొత్తంగా తన స్పెల్‌లో 3 ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. అతడి బౌలింగ్‌తో నార్త్‌ఈస్ట్‌ జోన్‌ 75/5 నుంచి 79/7కు కుప్పకూలింది. తన బౌలింగ్‌ గురించి మాట్లాడిన వైభవ్‌.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ తనకు బంతి ఇవ్వడాన్ని రిస్క్‌గా భావించాడని చెప్పాడు. “వికెట్లు పడకపోవడంతో నాకు రెండు, మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయమన్నారు. ఇషాన్‌ భయ్యా నాకు బంతి ఇవ్వడం రిస్క్‌ అనుకున్నాడు. కానీ.. నేను వికెట్‌ టేకర్‌నని ఆయనకు తెలియదు” అంటూ వైభవ్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. తనకు లభించిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టినట్లు వైభవ్‌ చెప్పాడు. “నేను ఐదు వికెట్లు తీసినా మూడు ఓవర్లకు మించి బౌలింగ్‌ చేసే అవకాశం రాదని నాకు తెలుసు. అందుకే లభించిన సమయంలో సాధ్యమైనంత బాగా బౌలింగ్‌ చేయాలని అనుకున్నా. ఒకే ప్రాంతంలో బంతిని పదేపదే వేయాలని ప్రయత్నించా” అని వివరించాడు. బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన తర్వాత బంతితో జట్టుకు సహకరించడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని కూడా యువ ఆటగాడు చెప్పాడు. బ్యాటర్‌గా వికెట్‌ తీయడం ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత 467 పరుగులు చేయగా.. నార్త్‌ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌ ఆడిన నార్త్‌ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. చివరకు ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్

Original source: tv9telugu.com
Read more on Kaizer News