Kaizer News

Union Cabinet Expansion: ప్రధాని మోదీ టూర్ తర్వాత

Union Cabinet Expansion: ప్రధాని మోదీ టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ - తెలుగు రాష్ట్రాలకు దక్కే కొత్త పదవులు ఎవరికి?

· State - Telangana · telugu.abplive.com

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని హస్తినకు చేరుకోగానే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ ప్రక్రియ వేగవంతం కానుందనే వార్తలు ఢిల్లీ వర్గాల్లో తీవ్రంగా చక్కర్లు కొడుతున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల ముందస్తు కసరత్తులతో పాటు, పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, సామాజిక-ప్రాంతీయ సమతౌల్యత, మరియు యువ నాయకత్వానికి చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర కేబినెట్‌లో అదనపు బెర్త్‌లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే సుదీర్ఘ లక్ష్యంతో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి మరో కేంద్ర మంత్రి పదవిని కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉండగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ, సామాజిక సమీకరణలు మరియు క్షేత్రస్థాయి బలాన్ని పెంచుకునే దిశగా మరో సీనియర్ నేతకు అవకాశం ఇచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. దక్షిణాదిలో ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలంటే పొత్తుధర్మం పాటిస్తూనే.. బీసీ, మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా కొత్త ముఖాలకు కేంద్ర పదవులు ఇవ్వడం బీజేపీ కి అత్యంత వ్యూహాత్మక అవసరం. ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా ప్రచారం తెలంగాణ నుంచి ముఖ్యాతి ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను కేంద్రంలోకి తీసుకుంటే రాష్ట్రంలో పార్టీకి ఊపు వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది. వారితో పాటు మాజీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ , ఆదిలాబాద్ ఎస్టీ ఎంపీ గోడెం నగేష్ పేర్లు కూడా రేసులో ఉన్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీ లేదా మహిళా కోటా కింద ఒకరికి చోటు దక్కవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ, జనసేనలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. అయితే, పొత్తులో భాగంగా జనసేనకు కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన ఉంది. బహుశా మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్న రాజ్యసభ లేదా లోక్‌సభ ఎంపీల్లో ఒకరికి కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కూటమిలో సయోధ్య దెబ్బతినకుండానే జనసేన కు ప్రాతినిధ్యం కల్పించి ఓటర్లకు సానుకూల సంకేతం ఇవ్వాలనేది కేంద్ర నాయకత్వ ఆలోచనగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ విస్తరణ ప్రణాళికలు కేవలం పాత మంత్రుల సేవలను అభినందించడానికో లేదా సాధారణ మార్పులకో పరిమితం కాకుండా.. 2029 ఎన్నికల వ్యూహానికి బలమైన పునాదిగా మారనున్నాయి. తెలంగాణలో సొంత బలాన్ని పెంచుకోవడం, ఏపీలో కూటమి బంధాన్ని మరింత గట్టిపరచుకోవడమే లక్ష్యంగా ఈ పదవుల ప

Original source: telugu.abplive.com
Read more on Kaizer News