సదాశివనగర్ : మండలంలోని మర్కల్–తిర్మన్పల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎదురుగా వాహనం వస్తే రోడ్డు కిందికి దిగలేని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో రోడ్డు దిగితే వాహనాలు అదుపు తప్పే అవకాశాలున్నాయి. చిన్నవర్షాలకు బీటీ రోడ్డు సై తం మట్టి రోడ్డును తలపిస్తుంది. ద్విచక్ర వాహనదారులకు రోడ్డు వెంబడి వెళ్లలేని పరిస్థితి. మర్కల్ గ్రామ శివారులో బీటీ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు