ముత్తుకూరు, ఆంధ్రప్రభ: ఆసియా ఖండంలో అతిపెద్ద ఓడరేవుగా పేర్కొంటున్న అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్లో శనివారం రికార్డు స్థాయిలో 1,95,128 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం దిగుమతి జరిగింది. ఈ విషయాన్ని ప్రాజెక్టు సీఈవో జగదీష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. ఇనుప ఖనిజాన్ని తీసుకొచ్చిన ఎంవీ మినరల్ డ్యూచ్లాండ్ నౌక కృష్ణపట్నం పోర్టులో లంగరు వేసింది. గతంలో 2024లో నమోదైన దిగుమతి రికార్డును తాజా దిగుమతి అధిగమించిందని సీఈవో తెలిపారు