Kaizer News

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

· State - Telangana · sakshi.com

వర్ని: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సిద్ధాపూర్‌ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సును నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించవచ్చని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవచ్చని వెల్లడించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ బాల్‌ సింగ్‌, జాకోరా సొసైటీ చైర్మన్‌ దశరథ్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News