రాష్ట్ర నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, తదితర అంశాలపై చర్చించారు. వాస్తవంగా తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెప్టెంబర్ ఒకటిన, కృష్ణా జలవివాదాల అంశంపై 7వ తేదీన ఏపీ, తెలంగాణ మధ్య కేంద్ర జల్శక్తి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది