Wardhannapet: వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా మూత్రం వెళ్లే పైపును కట్ చేయడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఆమె ఇప్పటికీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం WGLకు తరలిస్తామని చెప్పి ఇక్కడే ఉంచడంతో కుటుంబసభ్యులు ఆందోళన