Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. అంతరాష్ట్ర నేరస్థుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. సీసీ కెమెరాలు, పక్కా సమాచారంతో నిందితుడి అరెస్ట్. నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు. మహారాష్ట్ర పర్భణికి చెందిన షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ అరెస్ట్. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. 2023లో నిందితుడి నుంచి 4 పిస్టల్స్ స్వాధీనం. వివిధ కేసుల్లో మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన నిందితుడు. పిస్టల్ విక్రయ కేసులో మహారాష్ట్రలో పరారీలో ఉన్నట్లు పోలీసుల వెల్లడి. దొంగిలించిన బంగారం.విక్రయించేందుకు వెళ్తుండగా అరెస్ట్. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారుల అభినందనలు