ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశారనేది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది.ఉద్యోగ సంఘాల జేఏసీలు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల వరకు తమ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాయి