కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలోని 132వ బూత్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, గ్రామస్తులతో కలిసి వీక్షించారు. కడెం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని పార్టీ నాయకులు, గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు నాగవత్ శారద, ఉడుంపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు రాజేశ్వర్, నాయకులు మెంగని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు