Pithapuram: చేబ్రోలు పాత నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పిఠాపురం బీసీవై పార్టీ ఇన్చార్జ్ శీరం శ్రీను పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీకి రూ.10,116 విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు,చేబ్రోలు గ్రామ యాదవ సంఘం పెద్దలు,గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శీరం శ్రీనును సత్కరించారు