కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న పలువురు ఆఫీసర్లను బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఎలకు ప్రమోషన్లు కల్పిస్తూ జీఎంగా నియమించింది. జీఎం(ఎఫ్అండ్ఏ) సీహెచ్.మురళీధర్ను కార్పొరేట్ జీఎంగా బదిలీ చేశారు. కొత్తగూడెం ఏరియా ఏజీఎం ఎరుకలి బీభత్సను మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు జీఎంగా, ఎస్ఓటు డైరెక్టర్(ఫైనాన్స్) ఏజీఎం గండి కొమురయ్యకు జీఎంగా ప్రమోషన్ కల్పిస్తూ హైదరాబాద్ ఆఫీస్కు బదిలీ చేశారు. హైదరాబాద్ ఆఫీస్లో పని చేస్తున ఏజీఎం కుదురు కవితను కొత్తగూడెం కార్పొరేట్ హెచ్వోడీగా, శ్రీరాంపూర్ ఏరియా ఏజీఎం పిన్నింటి సుమలతను కార్పొరేట్కు, జైపూర్ ఎస్టీపీపీ ఏజీఎం శ్రీధర్ బంగలూరిని శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం రీజియన్లో కొనసాగుతున్న డీజీఎం సుధీర్ను కొత్తగూడెం ఏరియాకు, బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం ఎం.దామోదర్రావును కార్పొరేట్ ఫర్చేంజ్ విభాగానికి, మందమర్రి ఏరియా/హైదరాబాద్ డీజీఎం కె.మధుబాబును బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియాకు, కార్పొరేట్ ఫర్చేంజ్ డీజీఎం శీలం మోహన్రెడ్డిని కొత్తగూడెం రీజియన్కు యాజమాన్యం బదిలీ చేసింది