ఆరు గ్యారెంటీలు అటకెక్కించి.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండా అన్ని వర్గాలకు మొండి‘చేయి’ చూపిన కాంగ్రెస్ సర్కార్.. వెయ్యి రోజుల పాలనలో అనేక విజయాలు సాధించినట్టు గొప్పలు చెప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ మోసం చేయడమే గాక హైడ్రాను ఎగదోసి పేదలను, 22ఏ నిషేధిత జాబితా పేరుతో సామాన్యుల బతుకులను రోడ్డుకీడ్చిన దుర్మార్గాన్ని మరచి.. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఏవో అద్భుతాలు సృష్టించినట్టు బూటకపు ప్రచారం చేసుకుంటున్నది