రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చేర్చి వారి ఉసురుపోసుకుంటున్నారని నిప్పులుచెరిగారు. ఎలాంటి దరఖాస్తులు ఇవ్వకుండానే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి నివాస గృహాలను 22ఏ జాబితా నుంచి రాత్రికి రాత్రి తొలగించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని సామాన్యులు, రైతులు భూములు, ఆస్తులను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు