Kaizer News

Pithapuram: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేళ జనసేన యువజన

Pithapuram: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేళ జనసేన యువజన విభాగం ఆవిష్కరణ!

· State - Telangana · hmtvlive.com

పిఠాపురం: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న పార్టీ యువజన విభాగాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పిఠాపురంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వాములను చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత పాత్రను పెంచే దిశగా యువజన విభాగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పిఠాపురంలో జరిగే యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆన్‌లైన్ ద్వారా సందేశం ఇవ్వనున్నారు. యువతకు పార్టీ పట్ల ఉన్న బాధ్యత, ప్రజాసేవలో వారి పాత్ర, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయన సందేశం ఉండే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణలో యువతను కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2న యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించేందుకు జనసేన ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో యువతను పెద్ద సంఖ్యలో సమీకరించి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News