కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులు కొమురవెల్లి గ్రామానికి చెందిన అంబటిపల్లి యాదలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామివారికి నాలుగు లక్షల విలువగల వెండి బిందె విరాళంగా ఇచ్చారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేసి వారు తెచ్చిన వెండి బిందె ను ఆలయ పర్యవేక్షకులు చంద్రశేఖర్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మల్లికార్జున్ మరియు అర్చకులు ఆంజనేయులు దదితరు పాల్గొన్నారు