Kaizer News

Weather Updates : ఏపీకి 3 రోజులు వాన ముప్పు.. బలపడ

Weather Updates : ఏపీకి 3 రోజులు వాన ముప్పు.. బలపడుతున్న అల్పపీడనం.!

· State - Telangana · hmtvlive.com

Weather Updates : వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల వ్యవధిలో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత శక్తివంతంగా మారి ఉత్తర ఒడిశా , గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముంది. మరోవైపు, సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, నజీబాబాద్, హర్దోయ్, సుల్తాన్‌పూర్, డాల్టన్‌గంజ్, పూర్నియా మీదుగా ఈ అల్పపీడన కేంద్రాన్ని తాకుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే వాతావరణం ఏర్పడింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం వాతావరణ సూచన ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం ప్రాంతాలలో శనివారం నాడు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ఈ సమయంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రాబోయే ఆదివారం , సోమవారాల్లో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని, అలాగే బలమైన గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా పరిధిలోని జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు అలాగే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో వర్ష హెచ్చరికలు , భద్రతా సూచనలు రాయలసీమ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల కాలంలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు , ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గానీ నిలబడకూడదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభ

Original source: hmtvlive.com
Read more on Kaizer News