Kodad: గత మూడు దశాబ్దాలుగా కోదాడ పట్టణంలో పాన్ డబ్బా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ గంధం కనకమ్మ పట్ల కోదాడ టౌన్ సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత మహిళకు పూర్తి న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు సోమవారం కోదాడ పట్టణ బంద్కు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళకు అండగా నిలవాలని, బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు