ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి, రేవంత్రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారిపోయిందని, హైదరాబాద్ నడిమధ్యన ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని రూ.500 కోట్ల విలువైన ఆయిల్ఫెడ్ భూములను ప్రైవేట్కు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బహిరంగ మారెట్లో రూ.500 కోట్లు పలికే ఈ ఖరీదైన భూమిని కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతున్నదని హరీశ్రావు విమర్శించారు