సంచలనంగా మా రిన భద్రాచలం ఎమ్మెల్యే పీఏ అవినీతి బాగో తం అనేక మలుపులు తిరుగుతున్నది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ మోసం చేసిన వారిలో ఎక్కువ మంది నిత్యం క్యాంపు కార్యాలయానికి వచ్చే ఎమ్మెల్యే అనుచరులే ఉండటం గమనార్హం. వారినే లక్ష్యంగా చేసుకొని పీఏ తన అవినీతి దందాను నడిపినట్టు తెలుస్తున్నది. మణుగూరు బీటీపీఎస్ భూ నిర్వాసితుల స మాచారం అంతా సేకరించి వారికి ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా వసూలు చేసినట్టు సమాచారం