Kaizer News

Amaravati: బలవంతపు మతమార్పిడులకు వైసీపీయే కేరాఫ్ అ

Amaravati: బలవంతపు మతమార్పిడులకు వైసీపీయే కేరాఫ్ అడ్రస్: బుచ్చి రాంప్రసాద్ ధ్వజం!

· State - Telangana · hmtvlive.com

అమరావతి: బలవంతపు మతమార్పిడులు, మత ఘర్షణలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. రామతీర్థంలో రాములవారి విగ్రహానికి అపచారం, అంతర్వేదిలో రథం దహనం, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీ వంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటి వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాంటి ఘటనలపై నోరు మెదపని నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బలవంతపు మతమార్పిడులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ నేతలే చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ పార్టీకి చెందిన కుటుంబాల నుంచి వెలువడిన వీడియోలు మతమార్పిడుల అంశాన్ని బహిర్గతం చేశాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, హిందూ సంప్రదాయాలను పాటించకుండా ఒత్తిళ్లు తెచ్చారంటూ ఆయన ఆరోపించారు. మత విశ్వాసాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్నారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ స్వార్థం కోసం దేవుళ్లు, మతాలను ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడని బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో సంప్రదాయాలను పాటించలేదని ఆరోపించారు. విజయవాడలో వరుణయాగం నిర్వహించిన తీరుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం తగదన్నారు. ఆలయాల పవిత్రతను దెబ్బతీసేందుకు గతంలో కుట్రలు జరిగాయని కూడా బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. శ్రీశైలం లడ్డూ ప్రసాదం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పులిహోర తదితర ఘటనలను ప్రస్తావిస్తూ, ఆలయాలకు సంబంధించిన అంశాల్లో కావాలనే వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై కూడా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో చోరీలు జరిగినా నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తిరుపతిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ ఘటనలో నిందితుడిని వేగంగా పట్టుకున్నామని తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తూ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News