Kaizer News

మరోసారి ప్రేక్షకుల ముందుకు ప్రభాస్‌, త్రిష..!

మరోసారి ప్రేక్షకుల ముందుకు ప్రభాస్‌, త్రిష..!

· Entertainment · sakshi.com

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. స్టార్‌ హీరోల పుట్టినరోజున వారి బ్లాక్‌బాస్టర్‌ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల చిత్రాలు రీరిలీజ్‌ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ తరహాలోనే రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘వర్షం’ సినిమా రీరిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 23వ తేదీన? ప్రభాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం వర్షం. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నాట్లు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23న ఈ సినిమా రీరిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈసారి 4కే అల్ట్రా హెచ్‌డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారట. అయితే ఎన్ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. అనే పూర్తి సమాచారం త్వరలోనే ప్రకటించనున్నారు. 2004లో విడుదలై.. 2004లో విడుదలైన వర్షం చిత్రాన్ని శోభన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా త్రిష నటించింది. గోపిచంద్‌ విలన్‌గా కనిపించాడు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇన్నేళ్లు గడిచినా.. ఇందులోని పాటలు, కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ యూత్‌కి ఫేవరెట్‌గానే ఉన్నాయి. ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఏష నాగుల'... టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ ఫోక్! హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News