హనుమకొండ: తల్లి మృతి చెందిన గంటల వ్యవధిలోనే కుమారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన కొండేటి మల్లికాంబ (68) అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. తల్లి మృతితో తీవ్ర ఆందోళనకు గురైన కుమారుడు రవి(38) శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంటి వద్దే గుండె ఆగి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’