Chodavaram: చీడికాడ మండలం వరాహపురం నుండి విజయరామరాజుపేట వరకు 2 కోట్ల 85 లక్షల రూపాయలతో మరియు అప్పలరాజుపురం- కోణం రోడ్డుకు 3 కోట్ల రూపాయలతో నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు కలిసి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గం లోని రహదారుల దుస్థితి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావడం జరిగిందని.... సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, రహదారి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారని త్వరలోనే నియోజకవర్గంలోని రహదారులను పూర్తి చేస్తామని