Polavaram: వచ్చే నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాయకరావుపేటలో పర్యటించనున్నారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఘన స్వాగత కార్యక్రమం అందులో భాగంగా నిర్వహించే సంప్రదాయ 'జలహారతి' కార్యక్రమం—ఏర్పాట్లను చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు స్వయంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకుంటున్న తరుణంలోనే ముఖ్యమంత్రి పర్యటన జరగనుంది. ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు ఆయన బహిరంగ సభ జరిగే స్థలాన్ని కూడా పరిశీలించారు