Kaizer News

మనసును తాకే ‘కాగితం పడవలు’

మనసును తాకే ‘కాగితం పడవలు’

· Entertainment · ntnews.com

వర్ధన్‌, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్‌ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్‌, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. సెప్టెంబర్‌ 18న ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే వారివారి ప్రేమకథలు గుర్తొస్తాయి’ అని దర్శకుడు తుకారాం తెలిపారు. సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు వర్ధన్‌, కృష్ణప్రియ ఆనందం వెలిబుచ్చారు. సెప్టెంబర్‌ 18న సినిమాను విడుదల చేస్తున్నామని, తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని నిర్మాత అంజనప్ప నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా డీవోపీ రుద్రసాయి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: AIS నౌఫల్‌ రాజా

Original source: ntnews.com
Read more on Kaizer News