నల్గొండ: కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలనపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నల్లగొండ నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు