తెలుగు భాషాభిమాని, పుస్తక ప్రియుడు, మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు. ఆయనకు ఎనలేని సహకారం అందించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపకుల్లో ముఖ్యులు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ఒక ఉదాత్తమైన ఆశయసిద్ధి కోసం స్థాపించారు. దీని స్థాపన ఆనాడు చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుభాషా తల్లి ముద్దుబిడ్డలైన పై ప్రముఖులు 1901లో భాషా నిలయాన్ని స్థాపించారు