వీరబల్లి: అక్రమ సంబంధాల నేపథ్యంలో భర్త తరుపున బంధువులు ఒక వ్యక్తిని కొట్టి చంపిన వైనం వీరబల్లి మండలం ఓదివీడులో చోటుచేసుకుంది. పోలీసులు బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప మోచoపేట కు చెందిన షేక్ కాసిం 45 అనే వ్యక్తి ఓదివీడుకు చెందిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని యువతి ఇంటి వద్ద ఉండాడనే సమాచారంతో భర్త బంధువులు శనివారం దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన పై వీరబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు