ఓ వ్యక్తిని మరో వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టి, అతడి ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం జింకలగూడెంలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో జింకలగూడెంకు చెందిన షేక్ మౌలానా (38)కు, షేక్ ఇస్మాయిల్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి