Asifabad: కొమరం భీం జిల్లా సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగరావు ఎద్దు మేత కోసం రావణ్పల్లి అటవీ ప్రాంతానికి వెళ్ళగా పెద్దపులి దాడిలో మరణించింది. అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి నష్టపరిహారానికై ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరిగింది. సిర్పూర్ రేంజ్ లో పెద్దపులుల సంచారం ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్ళవద్దని ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు