Kaizer News

ఆర్టీసీ బస్సులో పొన్నం..

· State - Telangana · sakshi.com

హుస్నాబాద్‌: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 5 వేల ఆర్టీసీ బస్సులను నడిపించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం పందిల్ల గ్రామం నుంచి హుస్నాబాద్‌ బస్టాండ్‌ వరకు మంత్రి బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ప్రయాణికులకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రయాణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలను నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ మహిళా నాయకులు మంత్రికి రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) గెలిచాడు.. పొడిచాడు.. బాబుకు ఉద్యోగుల వార్నింగ్ ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News