రాజమండ్రి నగరంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏ.వి. అప్పారావు రోడ్డులోని జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం వేగంగా వెళ్తున్న ఒక స్కూల్ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానిక ప్రజలు, వాహనదారులు తక్షణమే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను […]