జీవో 97ను రద్దు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. శనివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్ను ఇంజినీరింగ్తోనే ఉంచాలని, పాలిటెక్నిక్ను లేబర్, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావొద్దని సూచించారు