కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చే యడంలో ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప ట్లోళ్ల శశిధర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ నుంచి చల్మెడ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం 8 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ప్రజలు దారి పొడువునా స్వాగతం పలికారు