Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారానికి చెందిన జయరాజు, జ్యోతిల ఏకైక కుమార్తె హిమబిందు వివాహం వినూత్నంగా జరిగింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె, అక్కడ పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ను ప్రేమించింది. శుక్రవారం రాత్రి అమెరికాలో జరిగిన వీరి పెళ్లి తంత్రులను తల్లిదండ్రులు స్వగ్రామం నుంచే ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి, వర్చువల్ విధానంలో అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలో బంధుమిత్రులకు వైభవంగా వివాహ విందు ఏర్పాటు చేశారు