మగటపల్లి: మగటపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామాలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి నామన ఫౌండేషన్ తరఫున రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. నామన ఫౌండేషన్ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు ఆలయ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి వెంకటేశ్వరరావు (తాత), బోలిశెట్టి మాధవ్, పిల్లా శ్రీనివాస్, సూరిశెట్టి కాశీ విశ్వనాథం, బోలిశెట్టి సత్యనారాయణమూర్తి, బోలిశెట్టి సతీష్, బోలిశెట్టి ఏసుబాబు, నామన నాగేశ్వరరావు, కుంపట్ల బాబ్జి, చెల్లింగి సింహాచలం, భూపతి శ్రీను, కుంచే శ్రీనివాస్, నామన ఆంజనేయస్వామి నాయుడు, కట్టా చంటి, కట్టా సంపదరావు తదితరులు పాల్గొన్నారు