Kaizer News

Actress : సినిమాలు హిట్ కావడంతో నాకు గర్వం తలకెక్క

Actress : సినిమాలు హిట్ కావడంతో నాకు గర్వం తలకెక్కింది.. ఎవరినీ లెక్కచేయలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

· Entertainment · tv9telugu.com

నమిత ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో చాలా బిజీగా ఉండే కథానాయిక. మలయాళం, తెలుగు, తమిళం భాషలలో నటించిన నమిత, తన గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఇండస్ట్రీలోనే గ్లామరస్ క్వీన్ ఆమె. విపరతీమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ. 2000వ దశకంలో ఆమె తోపు హీరోయిన్. తెలుగులో వెంకటేశ్ సరసన జెమిని చిత్రంలో నటించింది. అలాగే ప్రభాస్ నటించిన బిల్లా, ఆర్యన్ రాజేశ్ సొంతం వంటి చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. అప్పట్లో తనకు చాలా అహంకారం ఉండేదని.. ఎవరినీ లెక్కచేయలేదని తెలిపింది. ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్.. “నేను అహంకారంతో ఉండేదాన్ని, నా స్వభావం కూడా దురుసుగా ఉండేది,” అని నమిత అన్నారు. అకస్మాత్తుగా వచ్చిన కీర్తితో తనకు గర్వం తలకెక్కిందని అన్నారు. ఎవరినీ లెక్కచేయలేదని తెలిపారు. పరిశ్రమలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలలో ఈ వైఖరి మరింత స్పష్టంగా కనిపించిందని, ఆ సమయంలో వచ్చిన తొలి విజయం, నిరంతర మీడియా దృష్టి తనలో ఒకరకమైన హక్కు అనే భావనను కలిగించాయని, అయితే అది తనకు హాని కలిగించిందని ఇప్పుడు ఆమె గ్రహించారని చెప్పారు. “నా కెరీర్ ప్రారంభంలో నేను కొంచెం అహంకారంతో ఉండేదాన్ని. మొదటి రెండేళ్లపాటు నేను అలా ఉన్నప్పుడు, ‘నీకు ఈ వైఖరి ఉంటే, ఈ పరిశ్రమలో ఎక్కువ కాలం నిలబడలేవు’ అని చాలా మంది నాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత నేను మారాను,” అని ఆమె అన్నారు. ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు.. ఆ సమయంలో తన ప్రవర్తన వల్ల సెట్‌లో ఉన్న సహనటులు, టెక్నీషియన్లు, తన ప్రవర్తనకు సర్దుకుపోవాల్సి వచ్చిన జూనియర్ సిబ్బంది వంటి వారందరికీ ఇబ్బంది కలిగిందని నమిత అన్నారు. తన వైఖరి ఎటు దారితీస్తుందో గ్రహించి, అది తన కెరీర్‌ను నాశనం చేయకముందే హెచ్చరించిన పలువురు సహోద్యోగులు, ఒక్కరు కాకుండా, తనను మార్చుకోమని సలహా ఇచ్చారని ఆమె చెప్పింది. 1981 మే 10న గుజరాత్‌లోని సూరత్‌లో నమిత ముఖేష్ వంకావాలాగా జన్మించిన ఆమె, 1998లో 17 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2001 మిస్ ఇండియా పోటీలో సెలీనా జైట్లీ కిరీటాన్ని గెలుచుకోగా, ఆమె మూడవ రన్నరప్‌గా నిలిచారు. అందాల పోటీల ద్వారా గుర్తింపు వచ్చినప్పటికీ హిందీ చిత్రసీమలో ప్రవేశించలేకపోయిన నమిత, ఒక తెలుగు సినిమా ఆడిషన్‌కు అంగీకరించి దక్షిణాదికి వెళ్లారు. ఆమె తెలుగు తొలి చిత్రం ‘సొంతం’మూవీతో బ్రేక్ వచ్చింది. ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్.. ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా

Original source: tv9telugu.com
Read more on Kaizer News