దేశంలో పరీక్షల నిర్వహణపై నిరసనలు వెల్లువెత్తుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 నిర్వహణలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. రాజస్థాన్లోని జైపూర్ సీతాపుర ప్రాంత సెంటర్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతి 10, 15 నిమిషాలకోసారి విద్యుత్తు, సర్వర్ల్లో ఇబ్బందుల కారణంగా అభ్యర్థులు సరిగ్గా పరీక్ష రాయలేక పోయారు