అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఇవాళ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇరాన్ లోని లారాక్ ద్వీపంలో ఉన్న లాంచర్లను టార్గెట్ చేస్తూ అమెరికా క్షిపణి దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర మందుపాతరలు అమర్చేందుకు ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఈ దాడులకు దిగింది. దీంతో ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ గంటలోనే ప్రతిదాడికి దిగింది. జోర్డాన్ లోని అమెరికా బేస్ లను టార్గెట్ చేస్తూ ప్రతిదాడులు చేస్తోంది. US-Iran War: ఇరాన్ పై అమెరికా ఆంక్షల్లో చిక్కుకున్న 4 భారతీయ కంపెనీలివే..! జూలై నెలాఖరు తర్వాత జరిగిన మొదటి దాడిలో దక్షిణ ఇరాన్లోని లారాక్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో, హార్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపిస్తున్న రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హార్ముజ్ జలసంధిలో రాకెట్లను ప్రయోగించడానికి, సముద్ర మైన్లను అమర్చడానికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సిద్ధమవుతున్నట్లు గమనించినట్లు అధికారులు చెప్పిన తరువాత, అమెరికా దళాలు లారాక్ ద్వీపంలోని రెండు ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడి చేశాయి. గత వారం ఈ కీలకమైన నౌకా రవాణా మార్గం నుండి సముద్ర మైన్లను తొలగించే ఆపరేషన్ను యూఎస్ సెంట్రల్ కమాండ్ పూర్తి చేసిన తరువాత ఈ దాడి జరిగింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఆరో నెలలోకి ప్రవేశించడంతో, టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. Recommended For You ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డీల్ ..! ఆ దేశాన్ని 100 ఏళ్లు కొల్లగొట్టేలా ట్రంప్ ప్లాన్..! అన్నట్లుగానే లారాక్ ద్వీపంపై అమెరికా దాడి తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దక్షిణ ఇరాన్ నుండి పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి దిశగా బాలిస్టిక్, యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని అమెరికా, దాని మిత్రదేశాల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. లారక్ ద్వీపంపై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగా 'యా ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా' ఆపరేషన్ ను ఇరాన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జోర్డాన్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వీటికి ప్రతీకారంగా అమెరికా దాడులు కొనసాగిస్తే చమురు రంగంపై మరోసారీ తీవ్ర ప్రభావం తప్పదు