అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారం, సేవలు అందించడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెలలో నిర్వహించిన సభలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించి పనితీరు బాగోలేని అధికారులకు చురకలంటించారు.