మోదీ పాలనలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. చాలా దేశాల్లో ప్రజలు భారత్ అంటే వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వేతో ఈ విషయం స్పష్టవుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి మే 13 మధ్య 36 దేశాల్లో 42,092 మందిని సర్వే చేయగా సగటున 45 శాతం మంది భారత్పై అనుకూల, 41 శాతం మంది ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా అమెరికాలో భారత్కు అనుకూలంగా ఉన్న అభిప్రాయం గత కొన్నేండ్లతో పోలిస్తే తగ్గినట్టు సర్వే తెలిపింది