స్థూలకాయం, ఇతర జీవనశైలి వ్యాధులను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తన అమ్ముల పొదిలో నుంచి ఎరుపు రంగు షట్కోణ బాక్సుల్లో ‘హై ఫ్యాట్' ‘హై షుగర్', హై సాల్ట్' హెచ్చరికను సరికొత్త అస్త్రంగా తీసుకురానుంది. అనారోగ్యకరమైన ప్యాక్డ్ ఆహారాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ పదార్థాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల లేబుళ్లపై హెచ్చరికలు ప్రదర్శించాలని ఎఫ్ఎఎస్ఎస్ఏఐ ప్రతిపాదించింది