Kaizer News

ఆసియా సవాల్‌కు సై

ఆసియా సవాల్‌కు సై

· National - India · ntnews.com

నేడు థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు రా. 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌లో నిరాశ పరిచిన భారత మహిళల జట్టు తమకు అచ్చొచ్చిన ఆసియా కప్‌లో మరో ట్రోఫీ వేటకు సిద్ధమైంది. మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన భారత్‌ ఆదివారం దుబాయ్‌ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగే గ్రూప్‌-ఏ మ్యాచ్‌తో తమ పోరును ప్రారంభించనుంది. గత దశాబ్దకాలంలో టీ20 ఫార్మాట్‌ ఆసియా కప్‌ను శాసించిన జట్టుగా ఘన చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్‌, నిలకడలేమి రూపంలో భారత్‌ను పలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఆడిన 16 టీ20 మ్యాచ్‌ల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 9 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లోనూ ఓడి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా కెప్టెన్‌ హర్మన్‌ ఫామ్‌, జట్టులో ఆమె భవిష్యత్తుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పోరాడినప్పటికీ, హర్మన్‌ బ్యాటింగ్‌లో నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ధాటిగా ఆడుతుండటం జట్టుకు ప్లస్‌ పాయింట్‌. అయితే, వికెట్‌ పడిన తర్వాత ఇన్నింగ్స్‌ వేగాన్ని కొనసాగించడంలో మిడిలార్డర్‌ బ్యాటర్లు తరచూ విఫలమవుతున్నారు. నమ్మకమైన బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు రాబోయే ఆసియా గేమ్స్‌కు కూడా దూరం కావడం పెద్ద లోటు. ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీకా రావల్‌ మిడిలార్డర్‌ లోటును ఎంతవరకు భర్తీ చేస్తుందో చూడాలి. గత టోర్నీల్లో కీలక సమయంలో క్యాచులు నేలపాలు చేయడం భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈసారి ఫీల్డింగ్‌ లోపాలను సరిదిద్దుకోవడంపై జట్టు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక బౌలింగ్‌ విభాగం విషయానికొస్తే.. అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ స్పిన్‌ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లతో చెలరేగిన శ్రీ చరణికి రాధా యాదవ్‌, ప్రేమ రావత్‌ ఆమెకు జతకలిశారు. పేస్‌ బాధ్యతలను రేణుకా సింగ్‌ ఠాకూర్‌, క్రాంతి గౌడ్‌ అరుంధతి రెడ్డి, నందని శర్మ పంచుకోనున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News