తప్పక వస్తారని.. Andhra Prabha Top News చైనా-నేపాల్ సరిహద్దులోని జలవిద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకు పోయారని ఇంజనీర్ల కోసం బంధువులు శుభవార్త కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ వరదల్లొ ఇద్దకు మెకానికల్ ఇంజనీర్లు రాజేంద్ర ధకాల్, ఆవాష్ నేపాల్ బంధువులు… విరిద్దరి జాడ కోసం అల్లాడి పోతున్నారు. బతికి ఉన్నారా? చనిపోయారా? అనే ఆందోళనల్లో అల్లాడిపోతున్నారు. విరిద్దరూ చివరిసారిగా నేపాల్లోని త్రిశూలి-3ఏ సైట్లో కనిపించారు. దేశంలోని వరద ప్రభావిత ప్రాంతంలోని వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టులలో 930 మంది పైగా కార్మికులు గల్లంతు అయ్యారు. వీరిలో ఈ ఇద్దరూ కూడా ఉన్నారు. నేపాల్ గల్లంతయ్యాడని తెలిసినప్పుడు అతని కజిన్ సదిక్ష్య పాండే కూడా విధల్లో ఉన్నారు. “నా విరామ సమయంలో నేను నా ఫోన్ చూస్తుండగా వినాశకర వార్తను చూశాను,” అని ఆమె కన్నీరు పెట్టింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో మా సోదరి అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. నంబర్ అందుబాటులో లేదని వచ్చింది, దాంతో ఆమె ఉదయం 11 గంటల ప్రాంతంలో మళ్లీ ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.” ఈ విపత్తు సంభవించినప్పుడు నేపాల్ విధుల్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు, అతను తిరిగి వస్తాడని ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నారు. కుటుంబాలు ఆశ కోల్పోతున్నాయి, కానీ నా కజిన్ బయట సహాయం కోసం ఎదురుచూస్తున్నాడని ప్పటికీ నమ్ముతున్నాను. అతను త్వరగా, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను,” అని పాండే అన్నారు. నేపాల్ విద్యుత్ అథారిటీ పత్రాల ప్రకారం, తప్పిపోయిన తన కజిన్ రాజేంద్ర ధకాల్ కూడా నాలుగు కిలోమీటర్లకు పైగా విస్తరించిన ప్రాజెక్ట్ సొరంగాల నెట్వర్క్లోనే ఉన్నాడని అభిషేక్ ఖతివాడ నమ్ముతున్నారు. “ప్రస్తుతానికి, రాజేంద్రతో ఇంకా సంబంధాలు తెగిపోయాయి. అతను 35 మందికి పైగా ఇతర మనుషులతో పాటు సొరంగంలోనే ఉన్నాడని ఖతివాడ ఎదురు చూస్తున్నాడు. “అధికారులు సొరంగాన్ని తవ్వడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వారిని చేరుకోవడానికి వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. నేను, మా కుటుంబ సభ్యులందరూ ఆశతో ఉన్నాం క్షేమంగా రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం. ..అని బంధువులు అంటున్నారు