Bheemili: విశాఖ జిల్లా భీమిలీ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులకు పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారన్నవిషయం బయటకు వచ్చింది. దీంతో మీడియా కళాశాలకు వెళ్లి వాకబు చేసింది. కళాశాల ప్రిన్సిపాల్ తన దృష్టికి ఈ విషయం రాలేదని ఓ మూడునెలల క్రితం పిల్లల కర్రీ లో పురుగులు వచ్చాయని మరల రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.స్టూడెంట్స్ మాత్రం ఓ వారం క్రితం భోజనం లో పురుగులు వచ్చాయని ఆ తర్వాత బాగానే ఉందని అంటున్నారు