Kaizer News

ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?

ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?

· National - India · sakshi.com

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్‌ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్‌ వెనక్కి తగ్గిందని అంటోంది. సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్‌ ఏ. నాఫ్‌.. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది. మూడు అంశాలే అసలు వివాదమా? కాంగ్రెస్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీ లో మూడు కీలక అంశాలపై పెంగ్విన్‌ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్‌ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం. ‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్‌ ఆరోపణ ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగోయ్‌.. పెంగ్విన్‌ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు. ‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్‌ కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్‌ కేసవన్‌ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్‌ అలోక్‌.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు

Original source: sakshi.com
Read more on Kaizer News