నేపాల్ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనేందుకు జరుగుతున్న తీవ్ర ప్రయత్నాలకు మరో అవరోధం ఏర్పడింది. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో కొత్తగా ఏర్పడిన సరస్సు పొంగిపొర్లడం ప్రారంభించడంతో మరో ప్రాణాంతక వరద ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉన్నది. సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన మంచు కొండ విరిగిపడిన దరిమిలా ఆకస్మిక వరదలు విరుచుకుపడటంతో నేపాల్-టిబెట్ సరిహద్దుకు ఇరువైపులా కనీసం 587 మంది మరణించారు