‘అంతా ఆ ఉంగరం వల్లే’.. దంపతుల గల్లంతు ఘటనలో కొత్త విషయాలుఓ ఉంగరం తీసుకొచ్చిన తంటా ఇద్దరు దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన పైనుంచి గోదావరిలో దూకి వేల్పూరుకు చెందిన(ప్రస్తుతం భీమవరంలో ఉంటున్నారు) దొడ్డా వెంకట ధనసాయికృష్ణ అలియాస్ డీవీడీ(32), శిరీష(28) దంపతులు గల్లంతయ్యారు.