భారత్లో పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూఢచర్య నెట్వర్క్లపై మరోసారి చర్చ మొదలైంది. ఢిల్లీలో శుక్రవారం ఓ యువ దంపతులను అరెస్ట్ చేయడంతో, భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇటీవలి కేసులను పరిశీలిస్తే.. ఆన్లైన్లో టార్గెట్లను గుర్తించడం, హనీట్రాప్లోకి లాగడం, రక్షణ సంస్థలు-మౌలిక వసతులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం వంటి […]